కార్తీక్ రత్నం,హరికథ దర్శకుడు మ్యాగీ చేతులు మీదగా "తెరచాప" టీజర్ లాంచ్ అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మాతగా జోయల్ జార్జ్ రచనా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం తెరచాప. నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, స్రీలు ముఖ్యపాత్రలో నటిస్తూ రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, రాఖి, నాగ మహేష్, ఫిష్ వెంకట్, అశోక్, నాగి, అప్పారావు, రైసింగ్ రాజు, రాజేష్ భూపతి తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. అజీమ్, వెంకట్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేసిన ఈ చిత్రానికి ప్రజల క్రిష్, ఎం ఎల్ రాజా సంగీతాన్ని అందించారు. కాగా హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్లో హీరో కార్తీక్ రత్నం, హరికథ దర్శకుడు మ్యాగీ చేతుల మీదగా ఈ చిత్ర టీజర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్బంగా హరికథ దర్శకుడు మ్యాగి మాట్లాడుతూ... " పృథ్వి గారికి నమస్కారం. ఈ సినిమా టీం గురించి నాకు పెద్దగా తెలీదు, కానీ వీళ్ళు పెట్టిన ఎఫోర్ట్స్ నేను టీజర్ లో చూశాను. సినిమాలో మంచి కంటెంట్ ఉంది. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని నాకు నమ్మకం ఉంది." అని అన్నారు. నటుడు 30 ఇయర్స్ పృద్వి గారు మాట్లాడుతూ... "తెరచాప...
we give exclusive cinema news and all major political news also