ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

Featured Post

సౌదీ అరేబియాలో ఘనంగా జరిగిన "ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు"

  * సౌదీ అరేబియాలో ఘనంగా జరిగిన "ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు"* “*తెలుగు వారి ఆత్మగౌరవం*” తెలుగుజాతి ఐక్యతను ఆకాంక్షించిన తెలుగోడు ! తెలుగు వారి గోడు విని తీరాల్సిందే అని రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన మహనీయుడు ! మన, జన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన కథా నాయకుడు, మహా నాయకుడు అయిన మన అన్న నందమూరి తారక రామారావు.  ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో వైభవంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ వేడుకలు సౌదీ అరేబియాలో “సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య”ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నందమూరి తారకరామారావు గారి తనయులు శ్రీ నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చైర్మన్‌, తెలుగుదేశం పోలిట్‌బ్యూరో సభ్యులు శ్రీ టి.డి.జనార్ధన్‌, ప్రముఖ సినీ నటి ప్రభ, నందమూరి బెనర్జీ, నందమూరి బిజిలి గారు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అతిథులను ఈ కార్యక్రమంలో శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య అధ్యక్షులు  కోనేరు ఉమా మహేశ్వరరావు, మరియు ఈవెంట్  చైర్ కందిబేడల వరప్రసాద్,మరియు “సౌది అరేబియ తెలుగు సమాఖ్య” కార్య వర్గ సభ్యులు మరియు ఇతర తెలుగు ...
ఇటీవలి పోస్ట్‌లు

మదర్స్ డే సందర్భంగా ‘ఫ్రై డే’ మూవీ నుంచి ‘అమ్మ’ పాటను విడుదల చేసిన ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనిత.. ఘనంగా సాంగ్ లాంచ్ ఈవెంట్*

 * మదర్స్ డే సందర్భంగా ‘ఫ్రై డే’ మూవీ నుంచి ‘అమ్మ’ పాటను విడుదల చేసిన ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనిత.. ఘనంగా సాంగ్ లాంచ్ ఈవెంట్* దియా రాజ్, ఇనయ సుల్తానా, రిహానా, వికాస్ వశిష్ట, రోహిత్ బొడ్డపాటి హీరో హీరోయిన్స్‌గా నటించిన చిత్రం ‘ఫ్రై డే’. ఈ చిత్రాన్ని శ్రీ గణేష్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద కేసనకుర్తి శ్రీనివాస్ నిర్మించారు. ఈ సినిమాను డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ఈశ్వర్ బాబు ధూళిపూడి తెరకెక్కించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ‘ఫ్రై డే’ నుంచి వచ్చిన పోస్టర్లు సినిమా మీద అంచనాల్ని పెంచేసాయి. తాజాగా మదర్స్ డే సందర్భంగా అమ్మ ప్రేమను చాటే పాటను రిలీజ్ చేశారు. అమ్మ అంటూ సాగే ఈ పాటను ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఆదివారం నాడు రిలీజ్ చేశారు. అనంతరం ఈ పాటను చూసి చిత్రయూనిట్‌ను అభినందించారు. అమ్మ ప్రేమను చాటి చెప్పేలా ఎంతో అందంగా పాటను చిత్రీకరించారని ప్రశంసించారు. చిత్రయూనిట్ కు ఆమె ఆల్ ది బెస్ట్ తెలిపారు.  ఈ పాటను స్నిగ్ద నయని ఆలపించారు. మధు కిరణ్ సాహిత్యం ప్రతీ ఒక్కరి మనసుల్ని కదిలించేలా ఉంది. ప్రజ్వల్ క్...

శుభం’ సినిమాకు థియేట‌ర్స్‌లో వ‌స్తోన్న అద్భుత‌మైన స్పంద‌న‌.. ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసిన స‌మంత అండ్ టీమ్‌

 ‘ శుభం’ సినిమాకు థియేట‌ర్స్‌లో వ‌స్తోన్న అద్భుత‌మైన స్పంద‌న‌..  ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసిన స‌మంత అండ్ టీమ్‌ ప్ర‌ముఖ న‌టి, నిర్మాత స‌మంత రుత్‌ప్ర‌భు నిర్మాణంలో ట్రాలాలా మూవింగ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందించిన తొలి చిత్రం ‘శుభం’ . మే9న ఈ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ సినిమాకు ప్రీమియ‌ర్స్ నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. తొలిరోజున సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. తొలి రోజున రూ. 1.5 కోట్లు గ్రాస్ కలెక్ష‌న్స్‌ను సినిమా రాబ‌ట్టింది. రెండో రోజున కూడా అదే రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంటుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ విజ‌య‌వాడ‌లో కొన్ని థియేట‌ర్స్‌ను సంద‌ర్శించింది. హ‌ర్షిత్ రెడ్డి, గ‌విరెడ్డి శ్రీనివాస్‌, చ‌ర‌ణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావ‌ణి ల‌క్ష్మి, షాలిని కొండెపూడి, వంశీధ‌ర్ గౌడ్‌, డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ కండ్రేగుల త‌దిత‌రులు ఇన్‌స్టా లైవ్ ద్వారా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. సినిమాను ఇంత పెద్ద స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కుల‌కు చిత్ర యూనిట్ ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేసింది. సినిమా నిర్మాత‌గానే కాకుండా, గెస్ట్ రోల్ పోషించిన స‌మంత ఎంటైర్ టీమ్ సాధించిన విజ‌యం ప‌ట్ల గ‌ర్...

వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తోన్న రాగ్ మ‌యూర్‌

  వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తోన్న రాగ్ మ‌యూర్‌ సివ‌రాప‌ల్లి స‌క్సెస్ త‌ర్వాత వైవిధ్య‌మైన పాత్రల‌ను ఎంచుకుంటూ ఆ పాత్ర‌ల్లో ఒదిగిపోతూ త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్నారు రాగ్ మ‌యూర్‌. రీసెంట్‌గా స‌మంత నిర్మాణంలో ప్ర‌వీణ్ కండ్రేగుల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన శుభం సినిమాలో రాగ్ మ‌యూర్ పాత్ర‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. దీని గురించి ఆయ‌న మాట్లాడుతూ ‘‘నేను ఇంత‌కు ముందు చేసిన సినిమా బండి సినిమా ఎంత మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుందో అంద‌రికీ తెలిసిందే. అందులో నేను పోషించిన మ‌రిడేష్ బాబు పాత్ర‌కు కొన‌సాగింపుగా శుభం సినిమాలో నా రోల్ ఉంటుంది. నా పాత్ర‌ను ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ చాలా స‌ర‌దాగా డిజైన్ చేశారు. ఆయ‌న క‌థ నెరేట్ చేసిన త‌ర్వాత నా రోల్‌లోని కామెడీ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌ని అర్థమైంది. అందుక‌నే శుభం సినిమా చేయ‌టానికి నేను కాద‌న‌లేక‌పోయాను. నా న‌మ్మ‌కం నిజ‌మైంది. నా పాత్ర‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన స‌మంత‌గారికి, ప్ర‌వీణ్‌గారికి థాంక్స్‌. సినిమా చాలా మంచి విజ‌యాన్ని సొంతం చేసుకోవటం సంతోషంగా ఉంది’’ అన్నారు.  ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో త...

ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి "ప్రేమిస్తున్నా'' టైటిల్ ఖరారు !!

  ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి "ప్రేమిస్తున్నా'' టైటిల్ ఖరారు !!! వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న సినిమాకు ప్రేమిస్తున్నా టైటిల్ ను ఖరారు చేశారు. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు గా నటించారు. అన్ని ప్రేమకథల్లోనూ ప్రేమ ఉంటుంది, కానీ ఈ ప్రేమకథలో ఆకాశమంత ప్రేమ అనంతమైన ప్రేమ ఉంటుంది, లవ్ లో ఇదివరకు ఎవ్వరూ టచ్ చెయ్యని ఒక డిఫరెంట్ పాయింట్ తో ప్రేమిస్తున్నా సినిమాను తెరకెక్కించారు దర్శకుడు  భాను. యంగ్ జనరేషన్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే అనేక ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయి.  సాలూరి రాజేశ్వర రావు గారి కుటుంబం నుండి వస్తోన్న  సిద్ధార్థ్ సాలూరి ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఐదు సూపర్బ్ సాంగ్స్ ను ఇచ్చారు. ఇదొక మ్యూజికల్ లవ్ స్టొరీ కాబోతోంది. ప్రముఖ రచయితలు సాహిత్యం అందించారు. భాస్కర్ శ్యామల ఈ సినిమాకు తనదైన స్టైల్ లో సినిమాటోగ్రఫీ అందించారు, అనిల్ కుమార్ అచ్చు గట్ల ఈ సినిమాకు ఆలోచింపజేసే విధంగా సంభాషణలు రాయడం జరిగింది, ఈ సినిమాకు నిర్వహణ మర్రి రవికుమార్, ఈ ...

బద్మాషులు’ జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్

 ‘ బద్మాషులు’ జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్  !!! మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్ లో శంకర్ చేగూరి దర్శకత్వంలో రూపొందున్న హిలేరియస్ ఎంటర్టైనర్ ‘బద్మాషులు’. తార స్టొరీ టెల్లర్స్ బ్యానర్ పై బి. బాలకృష్ణ, C.రామ శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బద్మాషులు చిత్రం జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. దీపా ఆర్ట్స్ ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.  మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ పాత్రలు విశేషంగా, రూరల్ రూటెడ్ కథ, కథనం, కామెడీ చాలా ఆర్గానిక్ గా ఈ చిత్రాల్లో ఉండబోతున్నాయి, డైరెక్టర్ శంకర్ చేగూరి టేకింగ్ చాలా రిఫ్రెషింగ్ గా అన్ని వర్గాల ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా ఉండబోతోంది. ఇది మన ఊరి కథ అనే విధంగా ఈ చిత్రంలో పాత్రలు చాలా సహజంగా ఉంటాయి, డైరెక్టర్ శంకర్ చేగూరి వంద శాతం జనాలను రెండు గంటలు నవ్వించాలి అనే ఉద్దేశ్యంతో బద్మాషులు చిత్రాన్ని తెరకెక్కించారు.

పోటీ పరీక్షల్లో అత్యుత్తమంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం– శ్రీ చైతన్య మెహిదీపట్నం ప్రిన్సిపల్‌ ఎన్‌. స్వాతి

  పోటీ పరీక్షల్లో అత్యుత్తమంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం – శ్రీ చైతన్య మెహిదీపట్నం ప్రిన్సిపల్‌ ఎన్‌. స్వాతి  ‘‘పదవ తరగతి పోటీ పరీక్షల్లో శ్రీ చైతన్య మెహిదీపట్నం బ్రాంచి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. పదోతరగతి పరీక్షలతో పాటు ఐఐటీ, జేఈఈ, నీట్‌ వంటి అత్యున్నత స్థాయి పోటీ పరీక్షలతో పాటు తమ విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దడమే శ్రీ చైతన్య పాఠశాల లక్ష్యం’’ అని శ్రీ చైతన్య మెహిదీపట్నం బ్రాంచి ప్రిన్సిపల్‌ ఎన్‌.స్వాతి తెలిపారు. ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో మెహిదీపట్నం బ్రాంచి విద్యార్థులు సత్తా చాటారు. అబ్దుల్‌ సలామ్‌ 600ల మార్కులకు గాను 575, మహమ్మద్‌ షయాన్‌ క్యాస్‌ 572  మార్కులు సాధించారు. అదేవిధంగా ఏడుగురు విద్యార్థులు 560కి పైగా మార్కులు, 14 మంది 550కి పైగా మార్కులు, 51 మంది 500లకి పైగా మార్కులు సాధించి, తమ సత్తా చాటారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ ఎన్‌.స్వాతి మాట్లాడుతూ–‘‘మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు. అదేవిధంగా వారు మంచి మార్కుల...