పదిలో శ్రీ చైతన్య మణికొండ విద్యార్థుల ప్రతిభ
పదోతరగతి ఫలితాల్లో శ్రీ చైతన్య పాఠశాల మణికొండ బ్రాంచ్ విద్యార్థులు విజయ కేతనం ఎగురవేశారు. 600ల మార్కులకు గాను సమన్విత 584, శ్రీనిక 577, మనోజ్ఞ 576, గోపిక సాయి 571 మార్కులు సాధించారు. అదేవిధంగా 23 మంది విద్యార్థులు 550లకి పైగా మార్కులు, 63 మంది విద్యార్థులు 500లకి పైగా మార్కులు సాధించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులను ఏజీఎం శివరామ కృష్ణ, ఆర్ఐ అనిత, కోఆర్డినేటర్ రాజ్కుమార్, ప్రిన్సిపల్ అనిత, వైఎస్ ప్రిన్సిపల్ శ్రీలక్ష్మీ, అకాడమిక్ డీన్ జగన్ మోహన్ రెడ్డి, సి–బ్యాచ్ ఇంచార్జ్ మస్తాన్ రావు, ఉపాధ్యాయులు అభినందించారు.
కామెంట్లు