పోటీ పరీక్షల్లో అత్యుత్తమంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం– శ్రీ చైతన్య మెహిదీపట్నం ప్రిన్సిపల్ ఎన్. స్వాతి
పోటీ పరీక్షల్లో అత్యుత్తమంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం– శ్రీ చైతన్య మెహిదీపట్నం ప్రిన్సిపల్ ఎన్. స్వాతి
‘‘పదవ తరగతి పోటీ పరీక్షల్లో శ్రీ చైతన్య మెహిదీపట్నం బ్రాంచి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. పదోతరగతి పరీక్షలతో పాటు ఐఐటీ, జేఈఈ, నీట్ వంటి అత్యున్నత స్థాయి పోటీ పరీక్షలతో పాటు తమ విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దడమే శ్రీ చైతన్య పాఠశాల లక్ష్యం’’ అని శ్రీ చైతన్య మెహిదీపట్నం బ్రాంచి ప్రిన్సిపల్ ఎన్.స్వాతి తెలిపారు. ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో మెహిదీపట్నం బ్రాంచి విద్యార్థులు సత్తా చాటారు. అబ్దుల్ సలామ్ 600ల మార్కులకు గాను 575, మహమ్మద్ షయాన్ క్యాస్ 572 మార్కులు సాధించారు. అదేవిధంగా ఏడుగురు విద్యార్థులు 560కి పైగా మార్కులు, 14 మంది 550కి పైగా మార్కులు, 51 మంది 500లకి పైగా మార్కులు సాధించి, తమ సత్తా చాటారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఎన్.స్వాతి మాట్లాడుతూ–‘‘మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు. అదేవిధంగా వారు మంచి మార్కులు సాధించేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులకు, వారి తల్లిదండ్రులకు కూడా అభినందనలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్ ఏజీఎం కృష్ణ, ఆర్ఐ హరికృష్ణ, కోఆర్డినేటర్స్ ప్రవీణ్, జైపాల్ రెడ్డి, డీన్ మల్లేష్, ఇన్చార్జులు బాలరాజు, నదీమ్, రవి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్లు