ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మదర్స్ డే సందర్భంగా ‘ఫ్రై డే’ మూవీ నుంచి ‘అమ్మ’ పాటను విడుదల చేసిన ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనిత.. ఘనంగా సాంగ్ లాంచ్ ఈవెంట్*





 *మదర్స్ డే సందర్భంగా ‘ఫ్రై డే’ మూవీ నుంచి ‘అమ్మ’ పాటను విడుదల చేసిన ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనిత.. ఘనంగా సాంగ్ లాంచ్ ఈవెంట్*


దియా రాజ్, ఇనయ సుల్తానా, రిహానా, వికాస్ వశిష్ట, రోహిత్ బొడ్డపాటి హీరో హీరోయిన్స్‌గా నటించిన చిత్రం ‘ఫ్రై డే’. ఈ చిత్రాన్ని శ్రీ గణేష్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద కేసనకుర్తి శ్రీనివాస్ నిర్మించారు. ఈ సినిమాను డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ఈశ్వర్ బాబు ధూళిపూడి తెరకెక్కించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఇప్పటికే ‘ఫ్రై డే’ నుంచి వచ్చిన పోస్టర్లు సినిమా మీద అంచనాల్ని పెంచేసాయి. తాజాగా మదర్స్ డే సందర్భంగా అమ్మ ప్రేమను చాటే పాటను రిలీజ్ చేశారు. అమ్మ అంటూ సాగే ఈ పాటను ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఆదివారం నాడు రిలీజ్ చేశారు. అనంతరం ఈ పాటను చూసి చిత్రయూనిట్‌ను అభినందించారు. అమ్మ ప్రేమను చాటి చెప్పేలా ఎంతో అందంగా పాటను చిత్రీకరించారని ప్రశంసించారు. చిత్రయూనిట్ కు ఆమె ఆల్ ది బెస్ట్ తెలిపారు. 

ఈ పాటను స్నిగ్ద నయని ఆలపించారు. మధు కిరణ్ సాహిత్యం ప్రతీ ఒక్కరి మనసుల్ని కదిలించేలా ఉంది. ప్రజ్వల్ క్రిష్ బాణీ ప్రతీ ఒక్కరి హృదయాన్ని తాకేలా ఉంది. ప్రస్తుతం ఈ పాట మదర్స్ డే స్పెషల్‌గా నెట్టింట్లో వైరల్ అయ్యేలా ఉంది.

*సాంగ్ లాంచ్ అనంతరం నిర్మాత కేసనకుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ* .. ‘డైరెక్టర్ ఈశ్వర్ బాబు వల్లే ఈ ‘ఫ్రై డే’ చిత్రాన్ని నిర్మించాను. ఆయన చెప్పిన కథ నాకు చాలా కనెక్ట్ అయింది. నేను ఎదిగి ప్రయోజకుడ్ని అయ్యే టైంకి మా అమ్మ గారు చనిపోయారు. నా ఎదుగుదలను మా అమ్మ చూడలేదు. ఇక ఈశ్వర్ చెప్పిన కథ నా మనసుకు తాకింది. మదర్స్ డే సందర్భంగా అమ్మ పాటను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. 

*డైరెక్టర్ ఈశ్వర్ బాబు మాట్లాడుతూ* .. ‘‘ఫ్రై డే’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. పహల్గాం అటాక్ తరువాత నా మనసు కదిలిపోయింది. నాకు సామాజిక బాధ్యత ఉంది. గతంలో నేను గాడ్సే మీద సినిమా తీశాను. సోషల్ మీడియా వాడకం వల్ల ఇప్పుడు గాడ్సే గురించి ఎక్కువగా తెలుసుకుంటున్నారు. ఈ ‘ఫ్రై డే’ చిత్రంలో మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. మదర్స్ డే సందర్భంగా ‘అమ్మ’  పాటను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. మా సినిమాను చూసిన తరువాత ప్రతీ తల్లి తన కొడుకుని ఓ ఛత్రపతి శివాజీలా, మహారాణా ప్రతాప్ సింగ్‌లా పెంచుతారు. పోరాడే శక్తిని అమ్మ మాత్రమే ఇస్తుంది’ అని అన్నారు.

*హీరో రోహిత్ మాట్లాడుతూ* .. ‘స్నిగ్ద పాడిన అమ్మ పాట నన్ను కదిలించింది. ఈ కథను ఈశ్వర్ గారు చెప్పినప్పుడు కాస్త షాక్ అయ్యాను. ఈ మూవీలో ప్రతీ సీన్ ఎంగేజింగ్‌గా ఉంటుంది. అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే. చిన్నప్పటి నుంచీ నా ప్రతీ అడుగులో మా అమ్మ తోడుగా ఉండేవారు’ అని అన్నారు.

*దియా రాజ్ మాట్లాడుతూ* .. ‘స్నిగ్ద ప్రాణం పెట్టి అమ్మ పాటను అద్భుతంగా పాడింది. నాకు ఈ చిత్రంలో ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మా అందరినీ కెమెరామెన్ అందంగా చూపించారు. నాకు ఈ చిత్రంలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

*రిహాన మాట్లాడుతూ* .. ‘‘ఫ్రై డే’ సినిమా గురించి ఇప్పుడే ఎక్కువగా చెప్పలేను. స్నిగ్ద పాడిన అమ్మ పాట అందరినీ కదిలిస్తుంది. నాకు ఈ చిత్రంతో మంచి టీం దొరికింది. అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

*నటి కల్పిక మాట్లాడుతూ* .. ‘‘అమ్మ’ పాట ఎంతో ఎమోషనల్‌గా ఉంది. ప్రతీ అమ్మాయిలో అమ్మతనం ఉంటుంది.. బిడ్డను కంటేనే అమ్మ అని చెప్పలేం. ఈ పాట మహిళలందరికీ అంకితం’ అని అన్నారు.

*చైల్డ్ ఆర్టిస్ట్ గుడ్డు మాట్లాడుతూ* .. ‘‘ఫ్రై డే’ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

*సింగర్, నటి స్నిగ్ద మాట్లాడుతూ* .. ‘బార్డర్‌లో మన కోసం పోరాడుతున్న సైనికుల్ని కన్న తల్లులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. వాళ్ల త్యాగం మరవలేనిది. ఈ చిత్రంలో అమ్మ పాటను పాడినందుకు ఆనందంగా ఉంది. ఇందులో మంచి పాత్రని కూడా పోషించాను. చాలా ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాం. నాకు ఈ పాటను పాడే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ఎప్పటికీ రుణ పడి ఉంటాను’ అని అన్నారు.

*ఇనయ సుల్తానా మాట్లాడుతూ* .. ‘దర్శకుడు ఈశ్వర్ ‘ఫ్రై డే’ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. ప్రతీ ఒక్క పాత్రను చక్కగా మలిచారు. నిర్మాత శ్రీనివాస్ ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. దియా, రిహాన అద్భుతంగా నటించారు. స్నిగ్ద పాడిన అమ్మ పాటను వింటే నా కంట్లోంచి నీళ్లు వచ్చాయి. ఈ చిత్రంలో నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

నటీనటులు - దియా రాజ్, రిహాన, ఇనయ సుల్తానా, స్నిగ్ధ నయని, నవీన్, వికాస్ వశిష్ఠ, రోహిత్  బొడ్డపాటి , కోగంటి కార్తిక్, కోగంటి చంద్రకళ, బలగం సంజయ్, సుమన్, ప్రగతి, కోటేశ్మనవ, శుభోదయం రాజశేఖర్, ప్రభు, జిమ్ క్యారీ మహేశ్, ఆర్ కే నాయుడు తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్ - శ్రీ గణేష్ ఎంటర్ టైన్ మెంట్స్

డైరెక్టర్ - ఈశ్వర్ బాబు ధూళి పూడి 

స్టోరీ, డైలాగ్స్ - రాజ్ మరియన్

ప్రొడ్యూసర్ - కేసనకుర్తి శ్రీనివాస్

మ్యూజిక్ - ప్రజ్వల్ క్రిష్

లిరిక్స్ - మధు కిరణ్.ఎం

ఎడిటర్ - ప్రవీణ్ టమ్ టమ్

సినిమాటోగ్రఫీ - పృథ్వీ

పీఆర్ఓ - సాయి సతీష్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*

 * శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*  యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ  వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు..   *చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే  ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు  చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు  అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడ...

కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్*

 * కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్* బ్లూ హారిజన్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాతలు హారిక జెట్టి, బొట్టు మల్లేష్ గౌడ్, పిట్ల విజయలక్ష్మి నిర్మాణ సారధ్యంలో ప్రవీణ్ జెట్టి గారి దర్శకత్వంలో కల్లు కాంపౌండ్ 1995 చిత్రం తాజాగా విడులైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో చూద్దాం. క‌థ‌: కథానాయకుడు రాజు (గణేష్) గ్రామంలో జన్మించి విద్యావంతుడై గ్రామాభివృద్ధికి కృషి చేయాలనుకుంటాడు. అయితే, గ్రామాన్ని ఆర్థిక, రాజకీయ శక్తులతో కబళిస్తున్న ప్రతాప్ గౌడ్ (ప్రవీణ్) అనే క‌ల్లు తాగుబోతుల నాయకుడి అరాచకాలను తట్టుకోలేక, రాజు శాంతి మార్గం వదిలి హింసను ఎంచుకోవాలనుకుంటాడు. అయితే, కథానాయిక మల్లేశ్వరి (అయేషీ పటేల్) సలహా మేరకు సామాజిక సేవతో గ్రామ ప్రజలలో నమ్మకం కల్పించడం, వారి ఆత్మనిర్భరత పెంపొందించడం ద్వారా మార్గం చూపాలనుకుంటాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేదే సినిమా క‌థ‌.  1995 సంవత్సరంలో నాటి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతం నేపథ్యంగా సాగుతుంది ఈ సినిమా. ప్రస్తుతం తెలంగాణగా ఉన్న ఈ ప్రాంతంలో అప్పట్లో మద్య నిషేధం ఉండేది. క‌ల్లు తాగుబోతులు మాత్రమే నాటి గ్రామాల్లో ఎక్కువగా ఉండేవారు, అలాగే నక...

ఏప్రిల్‌ 24 న . శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 91 వ జయంతి

  ఏప్రిల్‌ 24 న . శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి   91 వ జయంతి  ప్ర‌పంచ సినీయ‌వ‌నిక‌పై తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమ‌డింప‌జేసిన గొప్ప నిర్మాణ సంస్థ పూర్ణోద‌యా సంస్థ‌.  తెలుగు సినిమా వ్యాపార ధోరణి పేరుతో అదుపుతప్పి విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే కాపు కాసిన ఆపద్భాందవుడు.. ఉత్త‌మాభిరుచితో సినిమాకి సేవ‌లు చేసిన గొప్ప నిర్మాత పూర్ణోద‌య అధినేత శ్రీ ఏడిద నాగేశ్వరరావు. 24,ఏప్రిల్ 1934  , గోదావరి జిల్లా తణుకు లో జన్మించారు .  నేడు ఆయన 91వ జయంతి .  శంకరాభరణం ,సాగరసంగమం,స్వయంకృషి ,స్వాతిముత్యం , ఆపత్బాంధవుడు , సితార , సీతాకోకచిలుక మొ: కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ప్రముఖ చలనచిత్ర  నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 90 వ జయంతి సందర్భంగా ఆయన మనకు అందించిన ఆణి ముత్యాల్లాంటి చిత్రాల గురించి గుర్తు చేసుకుందాం . కాలేజీ రోజుల నుండి నాటక అనుభవం ఉన్నందున , ఆయన దృష్టి నటన పై పడి, మద్రాస్ రైలెక్కిన ఈయనకు నిరాశే మిగిలింది .చేసేది లేక అక్కడే స్థిరపడి చిన్నా చితకా వేషాలు వేస్తూ, డబ్బింగులు చెబుతూ , నానా కష్టాలూ పడుతూ బతుకు కొన సాగించారు . అలాంటి సమయంలో 1976 లో ...