ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

శుభం’ సినిమాకు థియేట‌ర్స్‌లో వ‌స్తోన్న అద్భుత‌మైన స్పంద‌న‌.. ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసిన స‌మంత అండ్ టీమ్‌





 ‘శుభం’ సినిమాకు థియేట‌ర్స్‌లో వ‌స్తోన్న అద్భుత‌మైన స్పంద‌న‌..  ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసిన స‌మంత అండ్ టీమ్‌


ప్ర‌ముఖ న‌టి, నిర్మాత స‌మంత రుత్‌ప్ర‌భు నిర్మాణంలో ట్రాలాలా మూవింగ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందించిన తొలి చిత్రం ‘శుభం’ . మే9న ఈ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ సినిమాకు ప్రీమియ‌ర్స్ నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. తొలిరోజున సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. తొలి రోజున రూ. 1.5 కోట్లు గ్రాస్ కలెక్ష‌న్స్‌ను సినిమా రాబ‌ట్టింది. రెండో రోజున కూడా అదే రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంటుంది.

ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ విజ‌య‌వాడ‌లో కొన్ని థియేట‌ర్స్‌ను సంద‌ర్శించింది. హ‌ర్షిత్ రెడ్డి, గ‌విరెడ్డి శ్రీనివాస్‌, చ‌ర‌ణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావ‌ణి ల‌క్ష్మి, షాలిని కొండెపూడి, వంశీధ‌ర్ గౌడ్‌, డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ కండ్రేగుల త‌దిత‌రులు ఇన్‌స్టా లైవ్ ద్వారా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. సినిమాను ఇంత పెద్ద స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కుల‌కు చిత్ర యూనిట్ ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేసింది. సినిమా నిర్మాత‌గానే కాకుండా, గెస్ట్ రోల్ పోషించిన స‌మంత ఎంటైర్ టీమ్ సాధించిన విజ‌యం ప‌ట్ల గ‌ర్వంగా ఉన్న‌ట్లు తెలియ‌జేశారు. చిత్ర యూనిట్ అంతా ప్ర‌తిభావంతులుగా, బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలురని స‌మంత పేర్కొన్నారు.

చిత్ర యూనిట్‌లోని న‌టీన‌టుల చ‌క్క‌టి న‌ట‌న‌, డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన శుభం సినిమా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా అంద‌రినీ అల‌రిస్తోంది. ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం చ‌క్క‌గా ఉంద‌ని అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో చిత్ర యూనిట్ ఇన్‌స్టా లైవ్‌లోకి వ‌చ్చిన‌ప్పుడు ప్రేక్ష‌కులు సినిమాకు సీక్వెల్ ఉంటుందా? అని ప్ర‌శ్నించారు. దానికి స‌మంత స్పందిస్తూ అవున‌ని బ‌దులివ్వ‌టం ద్వారా భ‌విష్య‌త్తులో శుభం2 సినిమా ఉంటుంద‌ని తెలియ‌జేశారు.

శుభం సినిమాలో శ్రావ‌ణి త‌న భ‌ర్త పాత్ర‌లో న‌టించిన శ్రీనివాస్ గ‌విరెడ్డిని రిమోట్ కావాల‌నే స‌న్నివేశం త‌న‌కెంతో ఇష్టమని స‌మంత తెలియ‌జేసింది. ఈ సీన్‌కు ఎంతో క‌నెక్ట్ అయిన ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ క్ర‌మంలో స‌మంత సినిమాలో న‌టించిన న‌టీన‌టుల‌కు... ఏదో సాధించాల‌నే వారిలో త‌ప‌న‌, ఏదో నేర్చుకోవాల‌నే వారి మ‌న‌స్త‌త్వాల‌ను అలాగే కొన‌సాగించాలంటూ సమంత స‌ల‌హానిచ్చారు.

సినిమాలో త‌ను చేసిన గెస్ట్ అప్పియ‌రెన్స్‌లో న‌టించ‌టంపై స‌మంత స్పందిస్తూ ‘నేను క్యామియో చేయాల‌ని ముందుగా అనుకోలేదు. షూటింగ్ ముందు రోజు కూడా చేయ‌న‌నిచెప్పాను. అయితే ఇప్పుడు ఆ స‌న్నివేశంలో న‌టించ‌టంపై చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. ఇన్‌స్టా లైవ్ చివ‌ర‌లో శుభం మూవీలో మ‌రిడేష్ పాత్ర‌లో న‌టించిన న‌టుడు రాగ్ మ‌యూర్ క‌నిపించారు. త‌న‌కంటే సినిమా బండిలో మ‌రిడేష్ బాబు పాత్ర‌లో న‌టించిన మెప్పించిన రాగ్ మ‌యూర్ ఎంట్రీకే ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తుంద‌ని స‌మంత ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు.

మంచి క‌థ‌, క‌థ‌నం, ఊహించ‌ని ట్విస్ట్‌లు, హాస్యం, సస్పెన్స్‌ల క‌ల‌యిక‌తో రూపొందిన శుభం సినిమాలో న‌టించటం గురించి త‌మ అనుభ‌వాల‌ను పంచుకోవాల‌ని న‌టీన‌టుల‌ను స‌మంత కోరగా, వారు త‌మ అనుభ‌వాల‌ను ప్రేక్ష‌కుల‌కు తెలియ‌జేస్తూ శుభం సినిమా జ‌ర్నీలో తామెంతో ఎంజాయ్ చేశామ‌ని వారు తెలియ‌జేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*

 * శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*  యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ  వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు..   *చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే  ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు  చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు  అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడ...

కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్*

 * కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్* బ్లూ హారిజన్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాతలు హారిక జెట్టి, బొట్టు మల్లేష్ గౌడ్, పిట్ల విజయలక్ష్మి నిర్మాణ సారధ్యంలో ప్రవీణ్ జెట్టి గారి దర్శకత్వంలో కల్లు కాంపౌండ్ 1995 చిత్రం తాజాగా విడులైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో చూద్దాం. క‌థ‌: కథానాయకుడు రాజు (గణేష్) గ్రామంలో జన్మించి విద్యావంతుడై గ్రామాభివృద్ధికి కృషి చేయాలనుకుంటాడు. అయితే, గ్రామాన్ని ఆర్థిక, రాజకీయ శక్తులతో కబళిస్తున్న ప్రతాప్ గౌడ్ (ప్రవీణ్) అనే క‌ల్లు తాగుబోతుల నాయకుడి అరాచకాలను తట్టుకోలేక, రాజు శాంతి మార్గం వదిలి హింసను ఎంచుకోవాలనుకుంటాడు. అయితే, కథానాయిక మల్లేశ్వరి (అయేషీ పటేల్) సలహా మేరకు సామాజిక సేవతో గ్రామ ప్రజలలో నమ్మకం కల్పించడం, వారి ఆత్మనిర్భరత పెంపొందించడం ద్వారా మార్గం చూపాలనుకుంటాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేదే సినిమా క‌థ‌.  1995 సంవత్సరంలో నాటి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతం నేపథ్యంగా సాగుతుంది ఈ సినిమా. ప్రస్తుతం తెలంగాణగా ఉన్న ఈ ప్రాంతంలో అప్పట్లో మద్య నిషేధం ఉండేది. క‌ల్లు తాగుబోతులు మాత్రమే నాటి గ్రామాల్లో ఎక్కువగా ఉండేవారు, అలాగే నక...

ఏప్రిల్‌ 24 న . శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 91 వ జయంతి

  ఏప్రిల్‌ 24 న . శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి   91 వ జయంతి  ప్ర‌పంచ సినీయ‌వ‌నిక‌పై తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమ‌డింప‌జేసిన గొప్ప నిర్మాణ సంస్థ పూర్ణోద‌యా సంస్థ‌.  తెలుగు సినిమా వ్యాపార ధోరణి పేరుతో అదుపుతప్పి విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే కాపు కాసిన ఆపద్భాందవుడు.. ఉత్త‌మాభిరుచితో సినిమాకి సేవ‌లు చేసిన గొప్ప నిర్మాత పూర్ణోద‌య అధినేత శ్రీ ఏడిద నాగేశ్వరరావు. 24,ఏప్రిల్ 1934  , గోదావరి జిల్లా తణుకు లో జన్మించారు .  నేడు ఆయన 91వ జయంతి .  శంకరాభరణం ,సాగరసంగమం,స్వయంకృషి ,స్వాతిముత్యం , ఆపత్బాంధవుడు , సితార , సీతాకోకచిలుక మొ: కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ప్రముఖ చలనచిత్ర  నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 90 వ జయంతి సందర్భంగా ఆయన మనకు అందించిన ఆణి ముత్యాల్లాంటి చిత్రాల గురించి గుర్తు చేసుకుందాం . కాలేజీ రోజుల నుండి నాటక అనుభవం ఉన్నందున , ఆయన దృష్టి నటన పై పడి, మద్రాస్ రైలెక్కిన ఈయనకు నిరాశే మిగిలింది .చేసేది లేక అక్కడే స్థిరపడి చిన్నా చితకా వేషాలు వేస్తూ, డబ్బింగులు చెబుతూ , నానా కష్టాలూ పడుతూ బతుకు కొన సాగించారు . అలాంటి సమయంలో 1976 లో ...