ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తోన్న రాగ్ మ‌యూర్‌




 వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తోన్న రాగ్ మ‌యూర్‌


సివ‌రాప‌ల్లి స‌క్సెస్ త‌ర్వాత వైవిధ్య‌మైన పాత్రల‌ను ఎంచుకుంటూ ఆ పాత్ర‌ల్లో ఒదిగిపోతూ త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్నారు రాగ్ మ‌యూర్‌. రీసెంట్‌గా స‌మంత నిర్మాణంలో ప్ర‌వీణ్ కండ్రేగుల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన శుభం సినిమాలో రాగ్ మ‌యూర్ పాత్ర‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. దీని గురించి ఆయ‌న మాట్లాడుతూ ‘‘నేను ఇంత‌కు ముందు చేసిన సినిమా బండి సినిమా ఎంత మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుందో అంద‌రికీ తెలిసిందే. అందులో నేను పోషించిన మ‌రిడేష్ బాబు పాత్ర‌కు కొన‌సాగింపుగా శుభం సినిమాలో నా రోల్ ఉంటుంది. నా పాత్ర‌ను ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ చాలా స‌ర‌దాగా డిజైన్ చేశారు. ఆయ‌న క‌థ నెరేట్ చేసిన త‌ర్వాత నా రోల్‌లోని కామెడీ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌ని అర్థమైంది. అందుక‌నే శుభం సినిమా చేయ‌టానికి నేను కాద‌న‌లేక‌పోయాను. నా న‌మ్మ‌కం నిజ‌మైంది. నా పాత్ర‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన స‌మంత‌గారికి, ప్ర‌వీణ్‌గారికి థాంక్స్‌. సినిమా చాలా మంచి విజ‌యాన్ని సొంతం చేసుకోవటం సంతోషంగా ఉంది’’ అన్నారు. 

ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్నమూడో చిత్రం ‘పరదా’లో రాగ్ మ‌యూర్ న‌టిస్తున్నారు. ఇందులో ఆయ‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో క‌లిసి న‌టిస్తున్నారు. దీని గురించి ఆయ‌న మాట్లాడుతూ ‘‘పరదా’ చిత్రంలో పూర్తి నిడివి ఉన్న పాత్ర చేశాను. నా పాత్ర రూప‌క‌ల్ప‌న‌, తెర‌కెక్కించిన తీరు ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. స‌రికొత్త సోష‌ల్ డ్రామాగా ప‌ర‌దా చిత్రం తెర‌కెక్కింది. ప్రేక్ష‌కుల‌కు డిఫ‌రెంట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంది’’ అన్నారు. 

ప్ర‌స్తుతం GA2 నిర్మాణంలో రూపొందుతోన్న బ‌డ్డీ కామెడీ చిత్రంలో న‌టిస్తున్నారు రాగ్ మ‌యూర్‌. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తోన్న గ‌రివిడి ల‌క్ష్మి సినిమాలోనూ మ‌యూర్ న‌టిస్తున్నారు. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన ప్ర‌సిద్ద బుర్ర‌క‌థ క‌ళాకారిణి గ‌రివిడి లక్ష్మి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘‘భిన్నమైన పాత్రల్లో నటించటం నటుడిగా నాకెంతో ఆనందంగా ఉంది. డిఫ‌రెంట్ షేడ్స్ ఉన్న పాత్ర‌లు నాకు రావ‌టం చాలా హ్య‌పీ. దీని వ‌ల్ల న‌టుడిగా మ‌రింత స్కోప్ పెరుగుతోంది. ప్ర‌ముఖ బ్యానర్స్‌లోనూ సినిమాలు చేస్తున్నాను. దీని వ‌ల్ల నిర్మాణంపై కూడా అవ‌గాహ‌న క‌లుగుతోంది. అద్భుత‌మైన టెక్నీషియ‌న్స్‌తో ప‌ని చేయ‌టం వ‌ల్ల, వారితో క‌లిసి జ‌ర్నీ చేయ‌టం వ‌ల్ల న‌టుడిగా నాలో కొత్త కోణాన్ని ఆవిష్క‌రించే అవ‌కాశం క‌లుగుతోంది’’అని పేర్కొన్నారు రాగ్ మయూర్. 



’’

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*

 * శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*  యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ  వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు..   *చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే  ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు  చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు  అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడ...

కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్*

 * కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్* బ్లూ హారిజన్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాతలు హారిక జెట్టి, బొట్టు మల్లేష్ గౌడ్, పిట్ల విజయలక్ష్మి నిర్మాణ సారధ్యంలో ప్రవీణ్ జెట్టి గారి దర్శకత్వంలో కల్లు కాంపౌండ్ 1995 చిత్రం తాజాగా విడులైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో చూద్దాం. క‌థ‌: కథానాయకుడు రాజు (గణేష్) గ్రామంలో జన్మించి విద్యావంతుడై గ్రామాభివృద్ధికి కృషి చేయాలనుకుంటాడు. అయితే, గ్రామాన్ని ఆర్థిక, రాజకీయ శక్తులతో కబళిస్తున్న ప్రతాప్ గౌడ్ (ప్రవీణ్) అనే క‌ల్లు తాగుబోతుల నాయకుడి అరాచకాలను తట్టుకోలేక, రాజు శాంతి మార్గం వదిలి హింసను ఎంచుకోవాలనుకుంటాడు. అయితే, కథానాయిక మల్లేశ్వరి (అయేషీ పటేల్) సలహా మేరకు సామాజిక సేవతో గ్రామ ప్రజలలో నమ్మకం కల్పించడం, వారి ఆత్మనిర్భరత పెంపొందించడం ద్వారా మార్గం చూపాలనుకుంటాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేదే సినిమా క‌థ‌.  1995 సంవత్సరంలో నాటి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతం నేపథ్యంగా సాగుతుంది ఈ సినిమా. ప్రస్తుతం తెలంగాణగా ఉన్న ఈ ప్రాంతంలో అప్పట్లో మద్య నిషేధం ఉండేది. క‌ల్లు తాగుబోతులు మాత్రమే నాటి గ్రామాల్లో ఎక్కువగా ఉండేవారు, అలాగే నక...

ఏప్రిల్‌ 24 న . శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 91 వ జయంతి

  ఏప్రిల్‌ 24 న . శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి   91 వ జయంతి  ప్ర‌పంచ సినీయ‌వ‌నిక‌పై తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమ‌డింప‌జేసిన గొప్ప నిర్మాణ సంస్థ పూర్ణోద‌యా సంస్థ‌.  తెలుగు సినిమా వ్యాపార ధోరణి పేరుతో అదుపుతప్పి విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే కాపు కాసిన ఆపద్భాందవుడు.. ఉత్త‌మాభిరుచితో సినిమాకి సేవ‌లు చేసిన గొప్ప నిర్మాత పూర్ణోద‌య అధినేత శ్రీ ఏడిద నాగేశ్వరరావు. 24,ఏప్రిల్ 1934  , గోదావరి జిల్లా తణుకు లో జన్మించారు .  నేడు ఆయన 91వ జయంతి .  శంకరాభరణం ,సాగరసంగమం,స్వయంకృషి ,స్వాతిముత్యం , ఆపత్బాంధవుడు , సితార , సీతాకోకచిలుక మొ: కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ప్రముఖ చలనచిత్ర  నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 90 వ జయంతి సందర్భంగా ఆయన మనకు అందించిన ఆణి ముత్యాల్లాంటి చిత్రాల గురించి గుర్తు చేసుకుందాం . కాలేజీ రోజుల నుండి నాటక అనుభవం ఉన్నందున , ఆయన దృష్టి నటన పై పడి, మద్రాస్ రైలెక్కిన ఈయనకు నిరాశే మిగిలింది .చేసేది లేక అక్కడే స్థిరపడి చిన్నా చితకా వేషాలు వేస్తూ, డబ్బింగులు చెబుతూ , నానా కష్టాలూ పడుతూ బతుకు కొన సాగించారు . అలాంటి సమయంలో 1976 లో ...