ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన "బ్యాచిలర్స్ ప్రేమకథలు"







 పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన  "బ్యాచిలర్స్ ప్రేమకథలు"

యస్.యం. 4 ఫిలిమ్స్ బ్యానర్ పై గీత సింగ్, కార్తీక్ , కాశీ మదన్, ఇషాని, చలానా అగ్నిహోత్రి, శృతి లయ  నటీ నటులుగా యం.యన్. వి సాగర్ స్వీయ దర్శకత్వంలో  వస్తున్న చిత్రం "బ్యాచిలర్స్ ప్రేమ కథలు". ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రముఖ దర్శకులు వి. సముద్ర  కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ప్రముఖ దర్శకులు వీర శంకర్ క్లాప్ ఇచ్చారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో 

చిత్ర దర్శక, నిర్మాత, సాగర్ మాట్లాడుతూ.. ఇంతకుముందు నేను తీసిన "కాలం రాసిన కథలు" సినిమాకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఆ ఉత్సాహంతో దానికి సీక్వెల్ గా "బ్యాచిలర్స్ ప్రేమ కథలు సినిమా తీస్తున్నాను" ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు మంచి షోషల్ మెసేజ్ ఇవ్వబోతున్నాను.అలాగే ఇందులో కూడా నూతన నటీనటులను  ఇండస్ట్రీకి  పరిచయం చేస్తున్నాను.ఈ నెలలో షూటింగ్ స్టార్ట్ చేసుకుంటున్న ఈ సినిమాను త్వరలో షూటింగ్ పూర్తి చేసుకొని 2025 లోనే విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు

నటి గీతా సింగ్ మాట్లాడుతూ..అడియన్స్ అందరూ నా పాత్రకు కామెడీ ఎక్స్పెక్ట్  చేస్తారు. కానీ అందుకు భిన్నంగా ఈ సినిమాలో ఎమోషనల్ పాత్ర చేయబోతున్నాను. ఈ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాత  సాగర్ గారికి నా ధన్యవాదాలు అన్నారు.

నటుడు కార్తీక్ మాట్లాడుతూ.. యూత్ మెచ్చే మంచి మెసేజ్ ఉన్న ఇలాంటి సినిమా ద్వారా  ఇండస్ట్రీకు పరిచయం చేస్తున్న సాగర్ గారికి నా ధన్యవాదాలు.

నటుడు కాశీ మదన్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు బ్యాచులర్స్ పై వచ్చిన సినిమాలన్నీ మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు అదే కోవలో వస్తున్న "బ్యాచిలర్స్ ప్రేమకథలు'' సినిమాను కూడా ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

డి ఓ పి. ప్రసాద్ ఎస్ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు యూత్ ని ఆకట్టుకుంటాయి. అలాంటి మంచి కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా కూడా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. 

నటి ఇషాని మాట్లాడుతూ.. బెంగళూరులో మోడలింగ్ చేస్తూ సినిమాలో నటించాలని హంటింగ్ చేస్తున్న నాకు  యస్.యం. 4 ఫిలిమ్స్ బ్యానర్ లో వస్తున్న  "బ్యాచిలర్స్ ప్రేమ కథలు" సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాత సాగర్ గారికి నా ధన్యవాదాలు 

నటి శృతి లయ మాట్లాడుతూ.. ఈ స్టోరీ విన్నప్పుడు చాలా ఎక్సైట్ గా ఫీల్ అయ్యాను మంచి సోషల్ మెసేజ్ ఇస్తున్న ఇలాంటి సినిమాలో నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.

నటి చలానా అగ్నిహోత్రి మాట్లాడుతూ.. బ్యాచిలర్స్ కి బాగా కనెక్ట్ అయ్యే ఇలాంటి మంచి మూవీలో నేను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు 

నటీ నటులు 

గీత సింగ్, కార్తీక్ , కాశీ మదన్, ఇషాని, చలానా అగ్నిహోత్రి, శృతి లయ తదితరులు 

సాంకేతిక నిపుణులు 

బ్యానర్ : SM4 Films 

టైటిల్ : బ్యాచిలర్స్ ప్రేమ కథలు 

ప్రొడ్యూసర్- రైటర్- డైరెక్టర్ : 

ఎమ్ ఎన్ వి సాగర్ 

డి ఓ పి : ప్రసాద్ ఎస్ 

మ్యూజిక్ : మెరుగు అరమాన్ 

ఎడిటర్ : నందమూరి హరి 

పి ఆర్ ఓ: మధు వి ఆర్ 

డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*

 * శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*  యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ  వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు..   *చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే  ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు  చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు  అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడ...

కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్*

 * కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్* బ్లూ హారిజన్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాతలు హారిక జెట్టి, బొట్టు మల్లేష్ గౌడ్, పిట్ల విజయలక్ష్మి నిర్మాణ సారధ్యంలో ప్రవీణ్ జెట్టి గారి దర్శకత్వంలో కల్లు కాంపౌండ్ 1995 చిత్రం తాజాగా విడులైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో చూద్దాం. క‌థ‌: కథానాయకుడు రాజు (గణేష్) గ్రామంలో జన్మించి విద్యావంతుడై గ్రామాభివృద్ధికి కృషి చేయాలనుకుంటాడు. అయితే, గ్రామాన్ని ఆర్థిక, రాజకీయ శక్తులతో కబళిస్తున్న ప్రతాప్ గౌడ్ (ప్రవీణ్) అనే క‌ల్లు తాగుబోతుల నాయకుడి అరాచకాలను తట్టుకోలేక, రాజు శాంతి మార్గం వదిలి హింసను ఎంచుకోవాలనుకుంటాడు. అయితే, కథానాయిక మల్లేశ్వరి (అయేషీ పటేల్) సలహా మేరకు సామాజిక సేవతో గ్రామ ప్రజలలో నమ్మకం కల్పించడం, వారి ఆత్మనిర్భరత పెంపొందించడం ద్వారా మార్గం చూపాలనుకుంటాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేదే సినిమా క‌థ‌.  1995 సంవత్సరంలో నాటి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతం నేపథ్యంగా సాగుతుంది ఈ సినిమా. ప్రస్తుతం తెలంగాణగా ఉన్న ఈ ప్రాంతంలో అప్పట్లో మద్య నిషేధం ఉండేది. క‌ల్లు తాగుబోతులు మాత్రమే నాటి గ్రామాల్లో ఎక్కువగా ఉండేవారు, అలాగే నక...

ఏప్రిల్‌ 24 న . శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 91 వ జయంతి

  ఏప్రిల్‌ 24 న . శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి   91 వ జయంతి  ప్ర‌పంచ సినీయ‌వ‌నిక‌పై తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమ‌డింప‌జేసిన గొప్ప నిర్మాణ సంస్థ పూర్ణోద‌యా సంస్థ‌.  తెలుగు సినిమా వ్యాపార ధోరణి పేరుతో అదుపుతప్పి విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే కాపు కాసిన ఆపద్భాందవుడు.. ఉత్త‌మాభిరుచితో సినిమాకి సేవ‌లు చేసిన గొప్ప నిర్మాత పూర్ణోద‌య అధినేత శ్రీ ఏడిద నాగేశ్వరరావు. 24,ఏప్రిల్ 1934  , గోదావరి జిల్లా తణుకు లో జన్మించారు .  నేడు ఆయన 91వ జయంతి .  శంకరాభరణం ,సాగరసంగమం,స్వయంకృషి ,స్వాతిముత్యం , ఆపత్బాంధవుడు , సితార , సీతాకోకచిలుక మొ: కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ప్రముఖ చలనచిత్ర  నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 90 వ జయంతి సందర్భంగా ఆయన మనకు అందించిన ఆణి ముత్యాల్లాంటి చిత్రాల గురించి గుర్తు చేసుకుందాం . కాలేజీ రోజుల నుండి నాటక అనుభవం ఉన్నందున , ఆయన దృష్టి నటన పై పడి, మద్రాస్ రైలెక్కిన ఈయనకు నిరాశే మిగిలింది .చేసేది లేక అక్కడే స్థిరపడి చిన్నా చితకా వేషాలు వేస్తూ, డబ్బింగులు చెబుతూ , నానా కష్టాలూ పడుతూ బతుకు కొన సాగించారు . అలాంటి సమయంలో 1976 లో ...