ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మీడియా వారి చేతుల మీదుగా "కలివి వనం" చిత్ర పోస్టర్ లాంచ్



 


మీడియా వారి చేతుల మీదుగా "కలివి వనం" చిత్ర పోస్టర్ లాంచ్ 


ఏఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి నిర్మాతలుగా రాజ్ నరేంద్ర రచనా దర్శకత్వంలో పూర్తి తెలంగాణ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించిన సినిమా కలివి వనం. ఈ చిత్రానికి జియల్ బాబు సినిమాటోగ్రాఫర్ చేయగా మదీన్ ఎస్ .కె సంగీతం ఎడిటర్ చంద్రమౌళి మాటలు కోటగల్లి కిషోర్ అందించారు. రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్, సతీష్ శ్రీ చరణ్, అశోక్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించగా హీరోయిన్ గా నాగదుర్గ ఈ చిత్రం ద్వారా పరిచయం కానున్నారు. కాసర్ల శ్యామ్, తిరుపతి మాట్ల.కమల్ ఇస్లావత్ ఈ చిత్రానికి పాటలు అందించారు. 

ఈ చిత్రం వనములను సంరక్షించుకునే కాన్సెప్ట్ తో తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని గుట్రాజుపల్లి ప్రాంతంలోని సారంగాపూర్ అడవులలో చిత్రీకరించడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన బలగం, పొట్టేల్ వంటి చిత్రాలు లాగా ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ఎంతో బలంగా నమ్ముతున్నారు.  ఈ చిత్రం షూటింగ్ ఇంకా పాటలను పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా యూట్యూబ్ మీడియా మిత్రులు, శ్రేయోభిలాషుల ఆధ్వర్యంలో కొండగట్టు బృందావన్ రిసార్ట్ లో ఈ చిత్ర పోస్టర్ లాంచ్ ఘనంగా చేయడం జరిగింది. ముఖ్యంగా మై విలేజ్ షో శ్రీకాంత్, చందు, ధూమ్ ధాం ఛానల్ రాజు, యూట్యూబ్ స్టార్ టోనీ క్విక్, అక్షిత్ మార్వెల్, వెంకట్ జోడు, బబ్లూ, శివ వేల్పుల, అంతడుపుల నాగరాజు, రేంజరాళ్ల రాజేష్, బాలు కాయత్, డైరెక్టర్ హరి చరణ్, యమున తారక్, సింగర్ శిరీష, నాగలక్ష్మి, హరీష్ పటేల్, సౌజన్య, ప్రొడ్యూసర్ గుగ్గిళ్ళ శివప్రసాద్, మౌనిక డింపుల్, జి ల్ బాబు సినిమా అటోగ్రార్, మదీన్ ఎస్ కె, కమల్ ఇస్లావత్ తదితరులు పోస్టర్ లంచ్ కార్యక్రమాలకు హాజరై చిత్ర యూనిట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*

 * శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*  యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ  వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు..   *చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే  ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు  చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు  అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడ...

ఏప్రిల్‌ 24 న . శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 91 వ జయంతి

  ఏప్రిల్‌ 24 న . శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి   91 వ జయంతి  ప్ర‌పంచ సినీయ‌వ‌నిక‌పై తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమ‌డింప‌జేసిన గొప్ప నిర్మాణ సంస్థ పూర్ణోద‌యా సంస్థ‌.  తెలుగు సినిమా వ్యాపార ధోరణి పేరుతో అదుపుతప్పి విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే కాపు కాసిన ఆపద్భాందవుడు.. ఉత్త‌మాభిరుచితో సినిమాకి సేవ‌లు చేసిన గొప్ప నిర్మాత పూర్ణోద‌య అధినేత శ్రీ ఏడిద నాగేశ్వరరావు. 24,ఏప్రిల్ 1934  , గోదావరి జిల్లా తణుకు లో జన్మించారు .  నేడు ఆయన 91వ జయంతి .  శంకరాభరణం ,సాగరసంగమం,స్వయంకృషి ,స్వాతిముత్యం , ఆపత్బాంధవుడు , సితార , సీతాకోకచిలుక మొ: కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ప్రముఖ చలనచిత్ర  నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 90 వ జయంతి సందర్భంగా ఆయన మనకు అందించిన ఆణి ముత్యాల్లాంటి చిత్రాల గురించి గుర్తు చేసుకుందాం . కాలేజీ రోజుల నుండి నాటక అనుభవం ఉన్నందున , ఆయన దృష్టి నటన పై పడి, మద్రాస్ రైలెక్కిన ఈయనకు నిరాశే మిగిలింది .చేసేది లేక అక్కడే స్థిరపడి చిన్నా చితకా వేషాలు వేస్తూ, డబ్బింగులు చెబుతూ , నానా కష్టాలూ పడుతూ బతుకు కొన సాగించారు . అలాంటి సమయంలో 1976 లో ...

కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్*

 * కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్* బ్లూ హారిజన్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాతలు హారిక జెట్టి, బొట్టు మల్లేష్ గౌడ్, పిట్ల విజయలక్ష్మి నిర్మాణ సారధ్యంలో ప్రవీణ్ జెట్టి గారి దర్శకత్వంలో కల్లు కాంపౌండ్ 1995 చిత్రం తాజాగా విడులైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో చూద్దాం. క‌థ‌: కథానాయకుడు రాజు (గణేష్) గ్రామంలో జన్మించి విద్యావంతుడై గ్రామాభివృద్ధికి కృషి చేయాలనుకుంటాడు. అయితే, గ్రామాన్ని ఆర్థిక, రాజకీయ శక్తులతో కబళిస్తున్న ప్రతాప్ గౌడ్ (ప్రవీణ్) అనే క‌ల్లు తాగుబోతుల నాయకుడి అరాచకాలను తట్టుకోలేక, రాజు శాంతి మార్గం వదిలి హింసను ఎంచుకోవాలనుకుంటాడు. అయితే, కథానాయిక మల్లేశ్వరి (అయేషీ పటేల్) సలహా మేరకు సామాజిక సేవతో గ్రామ ప్రజలలో నమ్మకం కల్పించడం, వారి ఆత్మనిర్భరత పెంపొందించడం ద్వారా మార్గం చూపాలనుకుంటాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేదే సినిమా క‌థ‌.  1995 సంవత్సరంలో నాటి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతం నేపథ్యంగా సాగుతుంది ఈ సినిమా. ప్రస్తుతం తెలంగాణగా ఉన్న ఈ ప్రాంతంలో అప్పట్లో మద్య నిషేధం ఉండేది. క‌ల్లు తాగుబోతులు మాత్రమే నాటి గ్రామాల్లో ఎక్కువగా ఉండేవారు, అలాగే నక...