ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

గౌలిదొడ్డిలో ‘జిస్మత్ జైలు మండి’ 15వ బ్రాంచ్ గ్రాండ్ లాంచ్*





 *గౌలిదొడ్డిలో ‘జిస్మత్ జైలు మండి’ 15వ బ్రాంచ్ గ్రాండ్ లాంచ్*

*ముఖ్య అతిథులుగా హీరో శివాజీ, హీరోయిన్ అనన్య నాగళ్ల సందడి*

ఫుడ్ బిజినెస్ లో రోజురోజుకూ దూసుకుపోతున్న ‘జిస్మత్ జైలు మండి’ తాజాగా తన 15వ బ్రాంచ్  ను ప్రారంభించింది. హైదరాబాద్లోని బిజీ ఏరియా అయిన గౌలిదొడ్డిలో జయభేరీ అపార్ట్మెంట్స్ కు ఎదురుగా మంచి సౌకర్యవంతమైన బిల్డింగ్ లో ‘జిస్మత్ జైలు మండి’ కొత్త బ్రాంచ్ శనివారం సాయంత్రం స్టార్ట్ అయింది. హీరో శివాజీ, హీరోయిన్ అనన్య నాగళ్ల ముఖ్య అతిథులుగా హాజరై ‘జిస్మత్ జైలు మండి’ 15వ బ్రాంచ్  ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ ఫేం భోలే, ‘జిస్మత్ జైలు మండి’ ఓనర్  గౌతమి చౌదరి, పలువురు అతిథులు పాల్గొన్నారు.

‘జిస్మత్ జైలు మండి’ 15వ బ్రాంచ్ ప్రారంభం సందర్భంగా హీరో శివాజీ మాట్లాడుతూ..‘‘‘జిస్మత్ జైలు మండి’ కన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫుడ్ చైన్. సహజంగా నేన ఒక ప్లేస్ కు వెళ్తున్నామంటే అన్నీ చెక్ చేసకుని వస్తా. అందుకే వీళ్ల గురించి కూడా అన్నీ చెక్ చేసుకుని వచ్చా. వీళ్ల ఫుడ్ చాలా బాగుంటుంది. అందుకే ఇన్ని బ్రాంచ్  లు నడపగలుగుతున్నారు. అమ్మాయిలు పబ్ లు, క్లబ్ లకు వెళ్లే ఈ కాలంలో గౌతమి లాంటి వాళ్లు వ్యాపార రంగంలోకి వచ్చి రాణిస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది. 50 బ్రాంచులు పెట్టాలనేది ఆమె టార్గెట్. ఆ టార్గెట్ ను త్వరగా రీచ్ అవ్వాలని కోరుకుంటూ నా బెస్ట్ విషెస్ చెబుతున్నా.’’ అని అన్నారు.

హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ..‘‘గౌలిదొడ్డిలోని ‘జిస్మత్ జైలు మండి’ ఓపెనింగ్ కు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. జైలు కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగా ఉంది. ఫుడ్ టేస్ట్, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. అందుకే ఇన్ని బ్రాంచెస్ నడపగలుగుతున్నారు. మంచి ఫుడ్ తినాలనుకునే వాళ్లంతా ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ‘జిస్మత్ జైలు మండి’కి వచ్చేయండి’’ అని చెప్పారు.

‘జిస్మత్ జైలు మండి’ ఓనర్ గౌతమి చౌదరి మాట్లాడుతూ..‘‘శివాజీగారికి, అనన్య గారికి థ్యాంక్యూ సోమచ్. మా పార్టనర్ గౌతమ్ కు కంగ్రాట్స్. ఇది 15వ బ్రాంచ్.. ఈ జర్నీ అంత ఈజీగా కాలేదు. మాకు ఎలాంటి రెస్టారెంట్ కావాలో అలా డిజైన్ చేసుకున్నాము. మనకేం కావాలో ఆ గ్యాప్ ను ఫిల్ చేయాలని ఒక బిజినెస్ మ్యాన్ కొటేషన్ ను చదివి ఇలా ప్లాన్ చేశాం. రెస్టారెంట్స్ కు వెళ్తుంటే నాకు ఏమనిపించిందంటే.. మనకు కావాల్సిన క్వాలిటీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందుబాటు ధరలో లేదనిపించింది. మేము ఆయిల్స్ రీయూజ్ చేయము. ఫుడ్ కలర్స్ యాడ్ చేయము. స్టాక్ ఏరోజూ ఉండదు. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు జరిగినప్పుడు మా రెస్టారెంట్స్ లోనూ ప్రతిసారీ జరుగుతుంటాయి. ఇవన్నీ ఆలోచించి జాగ్రత్తగా, క్వాలిటీతో మేము బిజినెస్ చేస్తున్నాం. మాకున్న దేవుళ్లు మా కస్టమర్లే. ఇదే క్వాలిటీని ఎల్లప్పటికీ మెయిన్ టెన్ చేస్తాం.’’ అని తెలిపారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*

 * శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*  యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ  వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు..   *చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే  ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు  చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు  అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడ...

ఏప్రిల్‌ 24 న . శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 91 వ జయంతి

  ఏప్రిల్‌ 24 న . శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి   91 వ జయంతి  ప్ర‌పంచ సినీయ‌వ‌నిక‌పై తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమ‌డింప‌జేసిన గొప్ప నిర్మాణ సంస్థ పూర్ణోద‌యా సంస్థ‌.  తెలుగు సినిమా వ్యాపార ధోరణి పేరుతో అదుపుతప్పి విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే కాపు కాసిన ఆపద్భాందవుడు.. ఉత్త‌మాభిరుచితో సినిమాకి సేవ‌లు చేసిన గొప్ప నిర్మాత పూర్ణోద‌య అధినేత శ్రీ ఏడిద నాగేశ్వరరావు. 24,ఏప్రిల్ 1934  , గోదావరి జిల్లా తణుకు లో జన్మించారు .  నేడు ఆయన 91వ జయంతి .  శంకరాభరణం ,సాగరసంగమం,స్వయంకృషి ,స్వాతిముత్యం , ఆపత్బాంధవుడు , సితార , సీతాకోకచిలుక మొ: కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ప్రముఖ చలనచిత్ర  నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 90 వ జయంతి సందర్భంగా ఆయన మనకు అందించిన ఆణి ముత్యాల్లాంటి చిత్రాల గురించి గుర్తు చేసుకుందాం . కాలేజీ రోజుల నుండి నాటక అనుభవం ఉన్నందున , ఆయన దృష్టి నటన పై పడి, మద్రాస్ రైలెక్కిన ఈయనకు నిరాశే మిగిలింది .చేసేది లేక అక్కడే స్థిరపడి చిన్నా చితకా వేషాలు వేస్తూ, డబ్బింగులు చెబుతూ , నానా కష్టాలూ పడుతూ బతుకు కొన సాగించారు . అలాంటి సమయంలో 1976 లో ...

కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్*

 * కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్* బ్లూ హారిజన్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాతలు హారిక జెట్టి, బొట్టు మల్లేష్ గౌడ్, పిట్ల విజయలక్ష్మి నిర్మాణ సారధ్యంలో ప్రవీణ్ జెట్టి గారి దర్శకత్వంలో కల్లు కాంపౌండ్ 1995 చిత్రం తాజాగా విడులైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో చూద్దాం. క‌థ‌: కథానాయకుడు రాజు (గణేష్) గ్రామంలో జన్మించి విద్యావంతుడై గ్రామాభివృద్ధికి కృషి చేయాలనుకుంటాడు. అయితే, గ్రామాన్ని ఆర్థిక, రాజకీయ శక్తులతో కబళిస్తున్న ప్రతాప్ గౌడ్ (ప్రవీణ్) అనే క‌ల్లు తాగుబోతుల నాయకుడి అరాచకాలను తట్టుకోలేక, రాజు శాంతి మార్గం వదిలి హింసను ఎంచుకోవాలనుకుంటాడు. అయితే, కథానాయిక మల్లేశ్వరి (అయేషీ పటేల్) సలహా మేరకు సామాజిక సేవతో గ్రామ ప్రజలలో నమ్మకం కల్పించడం, వారి ఆత్మనిర్భరత పెంపొందించడం ద్వారా మార్గం చూపాలనుకుంటాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేదే సినిమా క‌థ‌.  1995 సంవత్సరంలో నాటి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతం నేపథ్యంగా సాగుతుంది ఈ సినిమా. ప్రస్తుతం తెలంగాణగా ఉన్న ఈ ప్రాంతంలో అప్పట్లో మద్య నిషేధం ఉండేది. క‌ల్లు తాగుబోతులు మాత్రమే నాటి గ్రామాల్లో ఎక్కువగా ఉండేవారు, అలాగే నక...