ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఘనంగా ఖుషి డాన్స్ స్టూడియో తొలి వార్షికోత్సవ వేడుకలు


 ఘనంగా ఖుషి డాన్స్ స్టూడియో తొలి వార్షికోత్సవ వేడుకలు 

హీరో రాజు, తన భార్య సుహానా కలిసి తన కూతురు ఖుషి పేరు మీద తమ కలలు సహకారం చేసుకునే విధంగా మొదలుపెట్టిన ఖుషి డాన్స్ స్టూడియో ప్రారంభమై సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కూకట్పల్లిలోని వారి డాన్స్ స్టూడియో వద్ద తొలి వార్షికోత్సవ వేడుకలు చేసుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కుతుబుల్లా నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు హాజరయ్యారు. అలాగే చిత్రం శ్రీను, సోదర చిత్ర నటుడు సంజోష్, అన్వేషి చిత్ర నిర్మాత కిరణ్ కందుల గారు, కొరియోగ్రాఫర్ బాబి, పంచ్ ప్రసాద్ ఇంకా మరికొందరు సినీ సెలబ్రిటీలు, కొరియోగ్రాఫర్లు, డాన్సర్స్ పాల్గొని ఈ వేడుకను మరింత ఘనవిజయం చేశారు. ఈ సందర్భంగా తమ దగ్గర డాన్స్ నేర్చుకుంటున్న స్టూడెంట్స్ తో కొన్ని డాన్స్ ప్రోగ్రాములు చేసి తమ ప్రతిభను చాటి చెప్పకుంటూ ఆ వేడుకను మరింత కళాత్మకంగా చేశారు. 

ఈ సందర్భంగా సోదర చిత్ర నటుడు సంజోష్ మాట్లాడుతూ... "డాన్స్ చేయడం అనేది ఎంత కష్టమైన విషయమో నటుడుగా నాకు తెలుసు. పిల్లలు చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. భవిష్యత్తులో మీరు మరింత బాగా చేసి ఉన్నత స్థాయికి వెళ్లాలి. అలాగే ఖుషి డాన్స్ స్టూడియో మరిన్ని ఇటువంటి వార్షికోత్సవాలు చేసుకుంటూ బాగా ఎదగాలని కోరుకుంటున్నాను" అన్నారు. 

నటుడు చిత్రం శ్రీను మాట్లాడుతూ... "ఖుషి డాన్స్ స్టూడియోస్ రాజు అంటే మాకు చాలా కావాల్సిన వారు. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగిన కుటుంబ సమేతంగా వస్తారు. తొలి వార్షికోత్సవం చేసుకున్నందుకు శుభాకాంక్షలు. ఇటువంటి మరెన్నో వార్షికోత్సవాలు చేసుకోవాలని కోరుకుంటున్నాను" అన్నారు. 

సుహాన గారు మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు. మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు" అన్నారు. 

ఖుషి డాన్స్ స్టూడియోస్ అధినేత, అందరికీ సుపరిచితుడు, చరితో పూరి, వైతరణి రానా, i20 చిత్ర నటుడు రాజు మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా నమస్కారం. నాకు డాన్స్ స్టూడియో గురించి అంతగా తెలియదు. నా మిత్రుడు సురేష్ నా వెనుక ఉండి సపోర్ట్ చేయడం వల్ల అలాగే మీరంతా నాకు అండగా నిలబడటం వల్ల నేను ఈరోజు ఇంతగా ఎదుగుతున్నాను. భవిష్యత్తులో కూడా మీ అందరి సపోర్ట్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను" అన్నారు. 

ఈ వేడుకల సందర్భంగా తమ దగ్గర డాన్స్ నేర్చుకున్న పిల్లలు డాన్స్ పెర్ఫార్మన్స్ చేసి తమ ప్రతిభను చూపించారు. అలాగే ఈ వేడుకకు హాజరైన వారందరికీ చెడు సత్కారంతో గౌరవించరు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*

 * శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*  యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ  వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు..   *చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే  ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు  చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు  అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడ...

కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్*

 * కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్* బ్లూ హారిజన్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాతలు హారిక జెట్టి, బొట్టు మల్లేష్ గౌడ్, పిట్ల విజయలక్ష్మి నిర్మాణ సారధ్యంలో ప్రవీణ్ జెట్టి గారి దర్శకత్వంలో కల్లు కాంపౌండ్ 1995 చిత్రం తాజాగా విడులైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో చూద్దాం. క‌థ‌: కథానాయకుడు రాజు (గణేష్) గ్రామంలో జన్మించి విద్యావంతుడై గ్రామాభివృద్ధికి కృషి చేయాలనుకుంటాడు. అయితే, గ్రామాన్ని ఆర్థిక, రాజకీయ శక్తులతో కబళిస్తున్న ప్రతాప్ గౌడ్ (ప్రవీణ్) అనే క‌ల్లు తాగుబోతుల నాయకుడి అరాచకాలను తట్టుకోలేక, రాజు శాంతి మార్గం వదిలి హింసను ఎంచుకోవాలనుకుంటాడు. అయితే, కథానాయిక మల్లేశ్వరి (అయేషీ పటేల్) సలహా మేరకు సామాజిక సేవతో గ్రామ ప్రజలలో నమ్మకం కల్పించడం, వారి ఆత్మనిర్భరత పెంపొందించడం ద్వారా మార్గం చూపాలనుకుంటాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేదే సినిమా క‌థ‌.  1995 సంవత్సరంలో నాటి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతం నేపథ్యంగా సాగుతుంది ఈ సినిమా. ప్రస్తుతం తెలంగాణగా ఉన్న ఈ ప్రాంతంలో అప్పట్లో మద్య నిషేధం ఉండేది. క‌ల్లు తాగుబోతులు మాత్రమే నాటి గ్రామాల్లో ఎక్కువగా ఉండేవారు, అలాగే నక...

లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!!

 " లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!! సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల  కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. రెండు రాష్ట్రాల వాళ్ళు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు.  ఇటీవల విడుదలైన ఈ చిత్ర సాంగ్స్, టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లగ్గం సినిమా అక్టోబర్ 18న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.  చక్కటి కథ,కథనాలు, వినసొంపైన సంగీతం, మనుషుల భావోద్వేగాలు, కుటుంబ విలువలు లగ్గం సినిమాలో ఉన్నాయని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి గారు తెలిపారు. "ఫ్యామిలీ అందరు కలిసి చూడదగ్గ సినిమాగా లగ్గం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని"నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు అన్నారు. నటీనటులు: సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు,  రఘుబాబు, రచ్చ రవి,  కనకవ్వ,  వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య...