ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పహాల్గాం ఉగ్రదాడి ఘటనను ఖండిస్తూ, మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ ఎన్ సి సి)లో కొవ్వొత్తుల ర్యాలీ *







 *పహాల్గాం ఉగ్రదాడి ఘటనను ఖండిస్తూ, మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ ఎన్ సి సి)లో కొవ్వొత్తుల ర్యాలీ *

పహాల్గాం ఉగ్రదాడి ఘటనను ఖండిస్తూ, మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదులను నామరూపాల్లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్న ప్రధానిమంత్రి మోదీకి, ఉగ్రవాదుల ఏరివేతలో ప్రాణాలు ఒడ్డి పోరాడుతున్న సైనికులకు తమ పూర్తి మద్ధతు ఇస్తున్నట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎఫ్ఎన్ సీసీ నాయకులు, సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్ సీసీ ప్రెసిడెంట్ కేఎస్ రామారావు, వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి, సెక్రటరీ తుమ్మల రంగారావు, జాయింట్ సెక్రటరీ కే సదా శివారెడ్డి, ఎంసీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, భాస్కర్ నాయుడు, జె బాలరాజు, ఏడిద రాజా, వీ వీ జి కృష్ణం రాజు (వేణు ),  కోగంటి భవానీ,   తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా *ఎఫ్ఎన్ సీసీ ప్రెసిడెంట్ కేఎస్ రామారావు మాట్లాడుతూ* - పహాల్గాం ఉగ్రదాడి హేయమైన చర్య. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు మన సైన్యం, మన ప్రభుత్వం, ప్రధాని మోదీ గారు తీసుకుంటున్న చర్యలకు మా పూర్తి మద్ధతు తెలియజేస్తున్నాం. వారికి సంఘీభావంగా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టాం. మన సైన్యం ఉగ్రవాదలకు గట్టి బుద్ధి చెబుతుందని నమ్ముతున్నాం. అన్నారు.

*ఎఫ్ఎన్ సీసీ  సెక్రటరీ తుమ్మల రంగరావు మాట్లాడుతూ* .. భారత ప్రజలకు మేం సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. శాంతియుత పౌరులపై ఇటువంటి క్రూరమైన చర్యలకు సమాజంలో స్థానం లేదు.. ఈ క్రూర దాడులు ఐక్యత, శాంతి, సామరస్యం అనే రాజ్యాంగ విలువలపై చేసిన ప్రత్యక్ష దాడి అని పేర్కొన్నారు. ఈ దాడి కి కఠినమైన ప్రతిఘటన ఉండాలని మోడీ ప్రభుత్వాన్ని అభ్యర్దిస్తున్నాము అని చెప్పారు. 

*రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ* - మన భారతదేశంలో ఎన్నో మతాల వారు కలిసి మెలిసి ఐక్యంగా ఉంటున్నాం. ఇలాంటి ఉగ్రచర్యల వల్ల మన ఐక్యతకు భంగం వాటిల్లదు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తున్నాం. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు మన ప్రభుత్వం , సైన్యం తీసుకుంటున్న చర్యలకు మా సంపూర్ణ మద్ధతు తెలియజేస్తున్నాం. అన్నారు.

*ఎఫ్ఎన్ సీసీ వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ* - పహాల్గాం ఉగ్రదాడి పిరికిపందల చర్య. ఈ దాడిని మనమంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఉగ్రవాదులు మరోసారి ఇలాంటి దాడులు జరపకుండా గట్టి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని నమ్ముతున్నాం. ప్రధాని మోదీ గారికి, మన సైన్యం చేస్తున్న వీరోచిత పోరాటానికి మేమంతా మీతోనే ఉన్నామని తెలుపుతున్నాం. అన్నారు.

*తుమ్మల దేవుశ్రీ మాట్లాడుతూ* - పహాల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడి క్రూరమైన చర్య. ఆ ఘటనలో అమాయకుల ప్రాణాలు బలితీసుకున్నారు. మృతుల కుటుంబాలకు మా సానుభూతి తెలియజేస్తున్నాం. కాశ్మీర్ పర్యటనకు గతంలో వెళ్లాను. అక్కడి ప్రజలు మంచివారు. ఎంతో ఆహ్లాదరమైన కాశ్మీర్ లో ఉగ్రవాదులు అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. వారికి మన ప్రభుత్వం, సైన్యం మర్చిపోలేని గుణపాఠాలు నేర్పాలి. అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆది శేషగిరి రావు,  కాజా సూర్యనారాయణ, నటుడు చిన్నా, బెనర్జీ  తదితరులతో పాటుగా ఎఫ్ఎన్ సీసీ సభ్యులు కొవ్వుత్తుల ప్రదర్శన చేసి పహాల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ, మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*

 * శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*  యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ  వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు..   *చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే  ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు  చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు  అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడ...

కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్*

 * కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్* బ్లూ హారిజన్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాతలు హారిక జెట్టి, బొట్టు మల్లేష్ గౌడ్, పిట్ల విజయలక్ష్మి నిర్మాణ సారధ్యంలో ప్రవీణ్ జెట్టి గారి దర్శకత్వంలో కల్లు కాంపౌండ్ 1995 చిత్రం తాజాగా విడులైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో చూద్దాం. క‌థ‌: కథానాయకుడు రాజు (గణేష్) గ్రామంలో జన్మించి విద్యావంతుడై గ్రామాభివృద్ధికి కృషి చేయాలనుకుంటాడు. అయితే, గ్రామాన్ని ఆర్థిక, రాజకీయ శక్తులతో కబళిస్తున్న ప్రతాప్ గౌడ్ (ప్రవీణ్) అనే క‌ల్లు తాగుబోతుల నాయకుడి అరాచకాలను తట్టుకోలేక, రాజు శాంతి మార్గం వదిలి హింసను ఎంచుకోవాలనుకుంటాడు. అయితే, కథానాయిక మల్లేశ్వరి (అయేషీ పటేల్) సలహా మేరకు సామాజిక సేవతో గ్రామ ప్రజలలో నమ్మకం కల్పించడం, వారి ఆత్మనిర్భరత పెంపొందించడం ద్వారా మార్గం చూపాలనుకుంటాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేదే సినిమా క‌థ‌.  1995 సంవత్సరంలో నాటి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతం నేపథ్యంగా సాగుతుంది ఈ సినిమా. ప్రస్తుతం తెలంగాణగా ఉన్న ఈ ప్రాంతంలో అప్పట్లో మద్య నిషేధం ఉండేది. క‌ల్లు తాగుబోతులు మాత్రమే నాటి గ్రామాల్లో ఎక్కువగా ఉండేవారు, అలాగే నక...

లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!!

 " లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!! సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల  కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. రెండు రాష్ట్రాల వాళ్ళు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు.  ఇటీవల విడుదలైన ఈ చిత్ర సాంగ్స్, టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లగ్గం సినిమా అక్టోబర్ 18న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.  చక్కటి కథ,కథనాలు, వినసొంపైన సంగీతం, మనుషుల భావోద్వేగాలు, కుటుంబ విలువలు లగ్గం సినిమాలో ఉన్నాయని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి గారు తెలిపారు. "ఫ్యామిలీ అందరు కలిసి చూడదగ్గ సినిమాగా లగ్గం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని"నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు అన్నారు. నటీనటులు: సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు,  రఘుబాబు, రచ్చ రవి,  కనకవ్వ,  వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య...