ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పాజిటివ్‌ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోన్న ‘రివెంజ్‌’





 

పాజిటివ్‌ టాక్‌తో  సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోన్న ‘రివెంజ్‌’


  ఆది అక్షర ఎంటర్టైన్‌ మెంట్స్‌ పతాకంపై బాబు పెదపూడి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘రివెంజ్‌’. నేహదేశ్‌ పాండే హీరోయిన్‌. రెట్టడి శ్రీనివాస్‌ దర్శకుడు. ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలై విజయవంతంగా రన్‌ అవుతోంది. ఈ సందర్భముగా ఈ రోజు ఫిలింఛాంబర్‌లో సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలుగు ఫిలిం ఛాంబర్‌ ప్రెసిడెంట్‌ బసిరెడ్డి మాట్లాడుతూ...‘‘ ఇటీవల కాలంలో మన తెలుగు సినిమాలు ఇంటర్నేషనల్‌ స్థాయిలో ఆడుతోన్న సంగతి తెలిసిందే. ఇంకా పెద్ద ఎత్తును ప్రమోషన్‌ చేసి భారతీయులు ఉన్న ప్రతీచోట పెద్ద సినిమాలతో పాటు చిన్న చిత్రాలు కూడా రిలీజ్‌ చేయాలి. దానికోసం ఆన్‌లైన్‌ , డిజిటల్‌ ప్రమోషన్స్‌ పై దృష్టి పెట్టాలి. ఇక రివెంజ్‌ సినిమా విషయానికొస్తే..బాబు పెదపూడి సినిమా పై పాషన్‌తో అమెరికా నుండి ఇండియా కొచ్చి ఒక మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేశారు. సినిమా  విడుదలై పాజిటివ్‌ టాక్‌తో రన్‌ అవుతోంది. ఇంకా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటూ ఇందులో నటించిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా’ అన్నారు.

 తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్‌ మాట్లాడుతూ....‘‘సినిమా మీద పాషన్‌తో బాబు పెదపూడి ఈ సినిమా చేశారు. నటిస్తూ స్వయంగా నిర్మించారు. కమల్‌ హాసన్‌గారి ‘ఎర్రగులాబీలు’ తరహా కాన్సెప్ట్‌తో అన్ని వర్గాలకు నచ్చేలా ‘రివెంజ్‌’ సినిమా చేశారు. ఇప్పటికే విడుదలైన సినిమాకు మంచి పేరు వస్తోంది. ఇంకా పెద్ద విజయాన్ని అందించాలని ప్రేక్షకులను కోరుకుంటూ దర్శక నిర్మాతలకు నా శుభాకాంక్షలు’’ అన్నారు.

 రివెంజ్‌ చిత్ర నిర్మాత, నటుడు బాబు పెదపూడి మాట్లాడుతూ..‘‘అమెరికా వెళ్లి దాదాపు 35 ఏళ్లు అవుతోంది. సినిమాలంటే మొదటి నుంచి ఉన్న ఆసక్తితో మహేష్‌ గారు నటించిన ‘అతడు’ సినిమాతో పాటు మరికొన్ని  చిత్రాల్లో నటించాను. ఆ తర్వాత దర్శకుడు శ్రీనివాస్‌ గారు రివెంజ్‌ స్టోరి చెప్పడంతో నచ్చి నటిస్తూ ఈ సినిమా నిర్మించా. ఈ శుక్రవారం విడుదలైంది. అన్ని చోట్ల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. చూసిన వారంతా ఫోన్‌ చేసి అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నేను ఇంత రెస్పాన్స్‌ వస్తుందని ఊహించలేదు. మా డైరక్టర్‌ చాలా కష్టపడ్డారు. మా చిత్రాన్ని ఇంకా పెద్ద సక్సెస్‌ చేస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు.

చిత్ర దర్శకుడు రెట్టడి శ్రీనివాస్‌ మాట్లాడుతూ...‘‘ప్రొడ్యూసర్‌ బాబు పెదపూడి గారితో ఐదేళ్ల ప్రయాణం. నన్ను, నా కాన్సెప్ట్‌ నమ్మి ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు దాన్ని నిలబెట్టుకున్నాను అనుకుంటున్నా. ఏ విషయంలో రాజీ పడకుండా సినిమా చేయడానికి స్వేఛ్చనిచ్చారు.  ఈ శుక్రవారం విడుదలైన మా చిత్రానికి అన్ని చోట్ల నుండి పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. చూసిన వారంతా సినిమా చాలా బావుందంటున్నారు. త్వరలో థియేటర్స్‌ కూడా పెంచుతున్నాం. అలాగే యుఎస్‌లో కూడా సినిమాను విడుదల చేయడానికి మా నిర్మాత ప్లాన్‌ చేస్తున్నారు. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులు ధన్యవాదాలు’’ అన్నారు.

 దర్శకుడు, నిర్మాత లయన్‌ సాయి వెంకట్‌ మాట్లాడుతూ...‘‘దర్శకుడు నాకు చాలా కాలంగా తెలుసు.  ప్రతిభావంతుడు. నిర్మాత బాబు పెదపూడి గారు ప్యాషన్‌తో ఈ సినిమా చేశారు. పాజిటివ్‌ టాక్‌తో సినిమా రన్‌ అవుతోంది’’ అన్నారు.


తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ రివెంజ్ చిత్రం సక్సెస్ మీట్ పెట్టారంటే సక్సెస్ ఫుల్ గా థియేటర్ లో రన్ అవుతుందని  అర్ధమైంది. నిర్మాత కు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.


ఇంకా ఈ కార్యక్రమంలో వడ్లపట్ల మోహన్‌, నాగులపల్లి పద్మిని పాల్గొని చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు’’ తెలిపారు.

బాబు పెదపూడి, నేహదేశ్ పాండే,   ఆరోహి, భార్గ‌వ్, నాగేష్ క‌ర్ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి డిఓపిః చిడ‌త‌ల న‌వీన్‌; సంగీతంః విజ‌య్ కురాకుల‌;  పీఆర్వోః ర‌మేష్ చందు;  ఎడిట‌ర్ః మేన‌గ శ్రీను; నిర్మాత: బాబురావు పెదపూడి(USA)  ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వంః రెట్టడి శ్రీనివాస్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*

 * శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*  యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ  వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు..   *చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే  ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు  చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు  అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడ...

కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్*

 * కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్* బ్లూ హారిజన్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాతలు హారిక జెట్టి, బొట్టు మల్లేష్ గౌడ్, పిట్ల విజయలక్ష్మి నిర్మాణ సారధ్యంలో ప్రవీణ్ జెట్టి గారి దర్శకత్వంలో కల్లు కాంపౌండ్ 1995 చిత్రం తాజాగా విడులైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో చూద్దాం. క‌థ‌: కథానాయకుడు రాజు (గణేష్) గ్రామంలో జన్మించి విద్యావంతుడై గ్రామాభివృద్ధికి కృషి చేయాలనుకుంటాడు. అయితే, గ్రామాన్ని ఆర్థిక, రాజకీయ శక్తులతో కబళిస్తున్న ప్రతాప్ గౌడ్ (ప్రవీణ్) అనే క‌ల్లు తాగుబోతుల నాయకుడి అరాచకాలను తట్టుకోలేక, రాజు శాంతి మార్గం వదిలి హింసను ఎంచుకోవాలనుకుంటాడు. అయితే, కథానాయిక మల్లేశ్వరి (అయేషీ పటేల్) సలహా మేరకు సామాజిక సేవతో గ్రామ ప్రజలలో నమ్మకం కల్పించడం, వారి ఆత్మనిర్భరత పెంపొందించడం ద్వారా మార్గం చూపాలనుకుంటాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేదే సినిమా క‌థ‌.  1995 సంవత్సరంలో నాటి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతం నేపథ్యంగా సాగుతుంది ఈ సినిమా. ప్రస్తుతం తెలంగాణగా ఉన్న ఈ ప్రాంతంలో అప్పట్లో మద్య నిషేధం ఉండేది. క‌ల్లు తాగుబోతులు మాత్రమే నాటి గ్రామాల్లో ఎక్కువగా ఉండేవారు, అలాగే నక...

లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!!

 " లగ్గం" అక్టోబర్ 18న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!! సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల  కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. రెండు రాష్ట్రాల వాళ్ళు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు.  ఇటీవల విడుదలైన ఈ చిత్ర సాంగ్స్, టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లగ్గం సినిమా అక్టోబర్ 18న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.  చక్కటి కథ,కథనాలు, వినసొంపైన సంగీతం, మనుషుల భావోద్వేగాలు, కుటుంబ విలువలు లగ్గం సినిమాలో ఉన్నాయని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి గారు తెలిపారు. "ఫ్యామిలీ అందరు కలిసి చూడదగ్గ సినిమాగా లగ్గం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని"నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు అన్నారు. నటీనటులు: సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు,  రఘుబాబు, రచ్చ రవి,  కనకవ్వ,  వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య...